ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎప్పటినుంచో వస్తున్న పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమానికి ఆయన ముహుర్తం ఫిక్స్ చేశారు. జూలై 8న అర్హులైన పేదలందరికీ ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తామన్నారు. ఇళ్లపట్టాల పంపిణీ అంశంపై అధికారులతో జగన్ సమీక్షా సమావేశం నిర్వహించారు. జూలై 8 లోపే మిగతా పనులన్నీ పూర్తిచేయాలన్నారు. లబ్దిదారులు మిగిలిపోయారన్న విజ్ఞప్తుతు తన వద్దకు రాకూడదని అధికారుల్ని ఆదేశించారు. మరో 15 రోజుల్లో గ్రామ సచివాలయాల్లో లబ్దిదారుల జాబితా పెట్టాలన్నారు. తనకు ఓటు వేయని వారికి కూడా ఇంటి పట్టా దక్కాలన్నారు. అర్హత ఉన్న వారు ఎవరూ కూడా తనకు ఇళ్ల పట్టలేదని చెప్పకూడదన్నారు జగన్.
ఏపీలో జూలై 8న పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ