హయత్ నగర్ మండలం కోహెడలో తాత్కాలికంగా ఏర్పాటు చేసిన పండ్ల మార్కెట్ గాలివాన బీభత్సానికి దెబ్బతిన్న సంగతి తెలిసిందే. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి డిమాండ్ మంగళవారం చేశారు. కోహెడలోని మార్కెట్ను మంగళవారం ఆయన పార్టీ నేతలతో కలిసి సందర్శించారు. అక్కడున్న మామిడి రైతులు, వ్యాపారులు, వాహన డ్రైవర్లతో సంభాషించారు. కనీసం ఆ మార్కెట్లో తాగునీరు, మరుగుదొడ్లు కూడా లేవని మహిళా కూలీలు రేవంత్కు చెప్పారు.అనంతరం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. రోజుకు 10 వేల మంది వచ్చే మార్కెట్లో కనీస సదుపాయాలు కూడా లేవని మండిపడ్డారు. కోహెడ తాత్కాలిక పండ్ల మార్కెట్ గాలి వానలకు పూర్తిగా నాశనమైందని అన్నారు. హడావుడిగా గడ్డిఅన్నారం నుంచి మార్కెట్ను కోహెడకు మార్చడం వెనుక కుట్ర ఉందని, ఇది పెద్ద కుంభకోణమని ఆరోపించారు. తక్షణమే ఇందుకు సంబంధించిన కాంట్రాక్టర్లపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.
ఆ నిర్ణయంలో కుట్ర, కుంభకోణం ఉంది.. రేవంత్ సంచలన ఆరోపణ